హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ పోరాటాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని తుంగుతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మలేషియాలోని కౌలాలంపూర్ ఎంఈసీసీ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ నేతలు, మైటా సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తుచేసుకుంటూ మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఇక్కడి తెలంగాణ ప్రజలతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కేసీఆర్ కృషితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ ఎన్నారై కో నాయకుడు సురకంటి శ్రీనివాస్, మైటా అధ్యక్షుడు ఎస్ తిరుపతి, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి, ఉపేందర్గౌడ్, పడాల సతీశ్, మైటా, బీఆర్ఎస్ నేతలు మన్సూర్, సందీప్, జ్యోతి, మౌనిక, సుప్రియ, శశి, శివ పాల్గొన్నారు.