సైదాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు తిరుకోవెల అంజయ్య (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ముత్యంపేటకు చెందిన అంజయ్య 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, కొండగట్టు ఆలయ వ్యవస్థాపక సభ్యుడిగా, చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మ డి ఏపీలో సీఎంలు జలగం వెంగళరావు, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, పలువురు మంత్రుల వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం అంజయ్య కుటుంబం హైదరాబాద్లోని సైదాబాద్ డివిజన్ కరణ్బాగ్ కాలనీలో నివాసముంటున్నది. ఆయనకు భార్య సత్యవతి, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాళి
అంజయ్య నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు మమత, నాయకులు సత్యనారాయణ, సహదేవ్, జీ వెంకట్, గోపి, మిర్జా రజాక్ అలీబేగ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఇతర అధికారులు తదితరులు అంజయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. సోమవారం సైదాబాద్ ఎర్రకుంట హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.