రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం గిట్టని రేవంత్రెడ్డిపై రైతులు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మూడో రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి, సబ్స్టేషన్ల ఎదుట దహనం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతోపాటు పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
‘సాగుకు 3గంటల కరెంటు చాల ని చెప్పే కాంగ్రెస్ నేతలకు రైతు లు వాతలు పెడతారు.. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇ చ్చి వారి కష్టాలు పోగొడితే రేవంత్రెడ్డి కండ్లు మండుతున్నాయి. రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్కు ఇష్టం లేదు. బీజేపీ నేతలేమో బోర్లకు మీటర్లు బిగిస్తామని అంటున్నారు. దేశ ప్రజలు బీఆర్ఎస్ పాలనను కోరుకోవడం ప్రతిపక్షాలకు మింగుడుపడడం లేదు’.. అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కందుకూరు మండల కేంద్రంలో నిర్వహించిన మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్రెడ్డి తదితరులతో కలిసి ఆమె పాల్గొన్నారు.