పెద్దపల్లి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు పెద్దపల్లి జంక్షన్, సమీప జిల్లాల ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి. హైదరాబాద్ నాంపల్లి మీదుగా 12723/24 నంబర్తో నడిచే ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెద్దపల్లి జంక్షన్లో దక్షిణ మధ్య రైల్వే హాల్టింగ్ ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అనుసంధానంగా ఉన్న ఈ రైలు పెద్దపల్లిలో నిలపకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అదేసమయంలో ఆంధ్రా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలెవరూ పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.