Telangana Express | హైదరాబాద్ : ఈ నెల 28న(ఆదివారం) తెలంగాణ ఎక్స్ప్రెస్ 8 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఉదయం 6 గంటలకు బయల్దేరాల్సిన రైలు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆలస్యంగా బయల్దేరనున్న నేపథ్యంలో ప్రయాణికులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.