Inter Exams | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా మంగళవారం సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. ఫిజిక్స్ పేపర్-2లో తప్పిదం చోటుచేసుకున్నది. ఇంగ్లిష్ మీడి యం వారికి ఒకలా.. తెలుగు మీడియం వారికి మరోలా ప్రశ్నలు ఇచ్చారు. ప్రశ్నపత్రంలోని 21వ ప్రశ్నలో ఈ పొరపాటు జరిగింది. తెలుగు మీడి యం ప్రశ్నపత్రంలో 8 మార్కుల ప్రశ్నతోపాటు, 2 మార్కుల ప్రశ్నను కలిపి ఆడిగారు. ఇంగ్లిష్ మీడియంలో 8 మార్కుల ప్రశ్నమాత్రమే ఇచ్చా రు.
తెలుగు మీడియం పేపర్లో ‘చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రము, పనిచేసే విధానాన్ని వివరించండి’, ‘ఒకానొక పరమాణు బాంబు విస్ఫోటంలో ఒక మైక్రోగ్రామ్ యురేనియం సంపూర్ణంగా నాశనమైతే ఎంత శక్తి విడుదలవుతుంది’? అన్న ప్రశ్న ఇచ్చారు. రియాక్టర్కు సంబంధించిన ప్రశ్న 8 మార్కులది కాగా, పరమాణు బాంబుకు సంబంధించినది రెండు మార్కుల ప్రశ్న.
అదే ఇంగ్లిష్ మీడియంలో 21వ ప్రశ్నను కేవలం Explain the principle and working of a nuclear reactor with help of a labelled diag ram (చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రము, పనిచేసే విధానాన్ని వివరించండి) అని మాత్రమే ఇచ్చారు. తెలుగు మీడి యం వారు మొత్తం సమాధానం రాయగా, ఇంగ్లి ష్ మీడియం వారు సగం సమాధానం రాసి వదిలేశారు. దీనిపై ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆది త్య మాట్లాడుతూ.. తప్పిదం జరిగిందని, తెలుగు మీడియంలో రాసే వారు తక్కువగా ఉన్నారని, 8 మార్కుల ప్రశ్న వరకు సమాధానం రాస్తే సరిపోతుందని వివరించారు. మూల్యాంకనం చేసేటప్పుడు దీనిపై జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.మంగళవారం 9 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.

Physics