హైదరాబాద్ : జాతీయ నీటి అభివృద్ధి సంస్థకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్రావు లేఖ రాశారు. గోదావరి – కావేరి అనుసంధానం ప్రతిపాదనపై ఈఎన్సీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముందుగా మహానది – గోదావరి అనుసంధానం పూర్తి చేయాలని, ఆ తర్వాతే గోదావరి – కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని కోరారు. తెలంగాణ అవసరాలు తీరాకే నీటి మళ్లింపు జరుపాలని స్పష్టం చేశారు. 75శాతం లభ్యతతో గోదావరిలో మిగులు జలాలు లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిందని గుర్తు చేశారు. ఇచ్చంపల్లి నుంచి గోదావరి – కావేరి అనుసంధానం సాధ్యం కాదని, ఇచ్చంపల్లిపై గతంలోనే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అభ్యంతరం చెప్పాయన్నారు. ముంపు విషయంలో ఛత్తీస్గఢ్ నుంచి మళ్లీ అభ్యంతరాలు రావొచ్చన్నారు.