హైదరాబాద్: 111 జీవో ఎత్తివేతకు సంబంధించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలకు గుదిబండగా మారిన జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయడం స్వాగతించదగ్గ పరిణామమని ఆమె పేర్కొన్నారు.
గతంలో ఇచ్చిన హామీని పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. న్యాయ పరమైన ఇబ్బందులు అధిగమించి దశల వారీగా జీవో సడలింపు చేపడతామని చెప్పారన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆయా గ్రామాల ప్రజల తరుపున సీఎం కేసీఆర్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.