హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ గాయకుడు సాయిచంద్ బృందంచే తెలంగాణ ధూం.. ధామ్.. కార్యక్రమం నిర్వహించబడును.
మడిపల్లి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థఙ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట రూరల్ ఇంఛార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హాజరు కానున్నారు. ధూం.. ధామ్.. కార్యక్రమానికి అంకుషాపూర్ గ్రామ ప్రజలు కూడా తరలిరావాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. ఈ రెండు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలతో ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.