హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హితవు పలికారు. గత పదేండ్లలో తెలంగాణలో వేల కోట్ల అభివృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించిన లెక్కలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ చురకలంటించారు. కళ్లముందు ఆవిష్కృతమైన ఈ అద్భుతాలను చూసి ఇప్పటికైనా మారలని సూచించారు. పంటల దిగుబడిలోనే కాదు, పశు సంపదలోనూ గత పదేండ్లు పండగేనని చెప్పారు. కులవృత్తులకూ కేసీఆర్ కొండంత అండగా నిలవడం వల్లే పశుసంపదలోనూ గణనీయ వృద్ధి సాధించని తెలిపారు. గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన, సంపద సృష్టిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయం తమదని వెల్లడించారు.
తెలంగాణలో ఉన్న డిమాండ్ తగ్గట్టుగా ఇక్కడే మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం చేశామన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ప్రతినిత్యం వచ్చే వందలాది లారీల దిగుబడికి గత పదేండ్లలో కళ్లెంవేశాని చెప్పారు. ప్రతి ఆలోచన వెనక ఒక సుదీర్ఘ అధ్యయనం ఉందని, కేసిఆర్ లక్ష్యం ఆరోగ్య తెలంగాణ నిర్మాణమని స్పష్టం చేశారు. నేడు గొర్లు, చేప పిల్లల పంపిణీని నిలిపేసి కుల వృత్తులను రూపుమాపే కుట్రలు చేస్తున్న పాలకులారా కేంద్ర లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ ఎక్స్ వేదికగా సూచించారు.
పంటల దిగుబడిలోనే కాదు..
పశు సంపదలోనూ గత పదేళ్లూ పండగే..కులవృత్తులకూ కేసిఆర్ కొండంత అండగా..
నిలవడం వల్లే పశుసంపదలోనూ గణనీయ వృద్ధిగ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన
సంపద సృష్టిలో… అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయంతెలంగాణలో ఉన్న డిమాండ్ తగ్గట్టుగా..
ఇక్కడే మాంసం,… pic.twitter.com/VtzTHCQBhV— KTR (@KTRBRS) November 2, 2024