హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా ‘హరితోత్సవం’ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులోభాగంగా హరితహారం, పచ్చదనం, చెట్ల ప్రాముఖ్యత, అర్బన్ ఫారెస్ట్లపై పోటీలు నిర్వహించి అవార్డులు ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది. హరితహారం, పచ్చదనం, చెట్ల ప్రాముఖ్యత, అర్బన్ ఫారెస్ట్లపై ఒక నిమిషం రీల్స్, వీడియోలు రూపొందించి 18లోపు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఈ -మెయిల్ చేయాలని కోరింది. ఎంపికైన వీడియోలకు త్వరలో అవార్డులు అందజేస్తామని అటవీశాఖ వెల్లడించింది.