హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 2,398 కేసులు వెలుగుచూడగా, ముగ్గురు మృతిచెందారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 21,676 మంది చికిత్సపొందుతూ ఐసొలేషన్లో ఉన్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,233, రంగారెడ్డిలో 192, మేడ్చల్ మల్కాజిగిరిలో 191, సంగారెడ్డి 75, హనుమకొండలో 60, నిజామాబాద్లో 50, మంచిర్యాలలో 49, మహబూబ్నగర్లో 44 కేసులు వెలుగుచూశాయి. కేసుల సంఖ్య పెరుగడంతో రికవరీ రేటు 96.35 శాతానికి తగ్గింది.
వ్యాక్సినేషన్
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 78,887 మందికి టీకాలు వేశారు. ఇందులో 20,102 మందికి మొదటిడోస్, 52,355 మందికి రెండో డోస్, 6,430 మందికి ప్రికాషన్ డోస్ వేశారు. ఇప్పటివరకు 15-18 ఏండ్ల మధ్యనున్న 48 శాతం మందికి మొదటి డోస్ పంపిణీ జరిగింది.