కౌటాల, ఏప్రిల్ 28 : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు నమోదు చేస్తామని తహసీల్దార్ ఎండీ. మునావర్ షరీఫ్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తనాల డీలర్లు, ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారి పాలకుర్తి రాజేశ్ అధ్యక్షతన బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీలర్ వద్దనే విత్తనాలు కొని రసీదు తీసుకోవాలని, ఏదైనా పంట నష్టం వచ్చినా, విత్తనోత్పత్తి జరగకపోయినా సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మండలంలోని విత్తనాల డీలర్లు, ఏఈవో ఉన్నారు.
మండలకేంద్రంలో..
బెజ్జూర్, ఏప్రిల్ 28 : ైగ్లెసిల్ విత్తనాలను అరికట్టాలని ఏవో రాజుల నాయుడు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ జమీర్, ఎస్ఐ సాగర్తో కలిసి ఫర్టిలైజర్ డీలర్లతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చాలామంది రైతులు నిషేధిత ైగ్లెసిల్ విత్తనాలు వేసి నష్టపోయారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆమోదిత విత్తనాలనే కొనేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ైగ్లెసిల్ విత్తనాలతో దిగుబడులు రావని, పత్తి తూకంలో బరువు చాలా తగ్గి నష్ట పోతున్నారని చెప్పారు. అంతేగాకుండా కలుపు నివారణకు ైగ్లెఫోసెట్ మందు ను వాడడం ద్వారా కూలీలకు క్యాన్సర్లాంటి వ్యాధుల సోక డం లేదా దురద పెట్టడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా నేల సారవంతం కోల్పోయి గ్లోబల్ వార్మీంగుకు దారి తీస్తుందన్నా రు. మహారాష్ట్ర సరిహద్దున బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో దళారులు ఎక్కువగా ైగ్లెసిల్ విత్తనాలను, ైగ్లెఫోసెట్ను రవాణా చేసే అవకాశం ఉందని, వీటి నివారణకు మండల స్థా యిలో, వ్యవసాయ అధికారితో పాటు తహసీల్దార్, ఎస్ఐ, గ్రా మస్థాయి కమిటీలో ఏఈవో, వీఆర్ఏతోపాటు గ్రామ పోలీసు అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. ైగ్లెసిల్ సరఫరా చేసే దళారులు వివరాలు తమకు అందజేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు రవితేజ, మారుతి, శ్రీధర్, మీనా ఫర్టిలైజర్ డీలర్లు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో..
కాగజ్నగర్టౌన్ , ఏప్రిల్ 28 : మండలంలోని జగన్నాథ్పూర్, బోరిగాం గ్రామాల్లో నకిలీ విత్తనాలు, నిషేధిత కలుపు మందు ైగ్లెఫోసెట్ వినియోగంపై కలిగే నష్టాలపై వ్యవసాయాధికారులు బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈవో యువరాణి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు వాడకం వల్ల దిగుబడి తగ్గుతుందని, నిషేధిత కలుపు మందుతో భూసా రం తగ్గుతుందన్నారు. వీటిని అమ్మినా, సరఫరా చేసినా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్యాంరావు, రైతులు పాల్గొన్నారు.