గుండాల, ఫిబ్రవరి 12: పోలీస్ స్టేషన్లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. ఈ ఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచనపల్లి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్నది. వరంగల్ జిల్లా సంగెం మం డలం గవిచర్లకు చెందిన బట్టి సంతోష్ యాదవ్ (30) ఆరో బెటాలియన్ ఇల్లెందు సబ్ డివిజన్లోని కొమరారం (కాచనపల్లి) పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్లో పీపీ డ్రిల్లో భాగంగా ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైర్ అయి బుల్లెట్ సంతోష్ తలలోకి దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.