హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆర్జేడీ నాయకులు, బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై తేజస్వి యాదవ్తో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ప్రగతిభవన్లో తేజస్వి యాదవ్కు సీఎం కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సీపీఐ, సీపీఎం జాతీయ అగ్రనేతలు శనివారం ప్రగతిభవన్లో సమావేశమైన సంగతి తెలిసిందే. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల్లో జాతీయ రాజకీయాలు, తెలంగాణ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఇవాళ తేజస్వి యాదవ్తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు.
హైదరాబాద్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ జాతీయ నేతలు, సీపీఐ అనుబంధ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ అగ్ర నాయకత్వం సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సరార్, పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిైళ్లె, బాలకృష్ణన్, ఎంఏ బేబీ, సీపీఐ జాతీయ నేతలు డీ రాజా, పార్లమెంటరీ పా ర్టీ నేత ఎంపీ బినయ్ విశ్వం, కేరళ రెవెన్యూశాఖ మంత్రి రాజన్, సీపీఐ తెలంగాణ నేతలు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్రెడ్డి, ప్రణాళికాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, టీఆర్ఎస్ నేత శ్రవణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.