హైదరాబాద్ : వృక్షమాత, ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణవేత్త, పద్మ శ్రీ తిమ్మక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క(110) ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లె, పట్టణ ప్రగతి సమీక్షా సమావేశానికి తిమ్మక్కను కేసీఆర్ స్వయంగా తీసుకెళ్లారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు, అధికారులకు తిమ్మక్కను కేసీఆర్ పరిచయం చేశారు.
వృక్షమాత, ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణవేత్త, పద్మ శ్రీ తిమ్మక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు pic.twitter.com/INTBYEspgt
— Namasthe Telangana (@ntdailyonline) May 18, 2022
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తిమ్మక్క కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అవసరమైన మేరకు మొక్కలు అందజేస్తానని సీఎంకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క పడుతున్న తపన.. అక్కడున్న వారందరిలో స్ఫూర్తిని నింపింది.
బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మక్క కూడా నిలిచారు. పెళ్లైన 25 సంవత్సరాల వరకు కూడా సంతానం కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి, పచ్చదనం పర్యావరణ హితం కోసం తాను పనిచేస్తున్నారు. తిమ్మక్క అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
వృక్షమాత, ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణవేత్త, పద్మ శ్రీ తిమ్మక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు pic.twitter.com/8VnX9A0O2h
— Namasthe Telangana (@ntdailyonline) May 18, 2022