CEO Vikas Raj | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి శుక్రవారం స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించారు. పోలింగ్ కోసం నవంబర్ 29, 30 తేదీల్లో వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 1) ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఆ ఆదేశాల్లో తెలిపారు.