హైదరాబాద్ : సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణపై భేటీలో చర్చించనున్నారు. దీంతో పాటు పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది.