జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): తన వ్య క్తిగత ఫొటోలు ఇతర స్నేహితులకు షేర్ చేయడాన్ని అవమానంగా భా వించే ఇంజినీరింగ్ విద్యార్థిని పబ్బోజు రక్షిత (20) ఆత్మహత్య చేసుకొన్నదని, ముగ్గురిపై కేసు నమోదు చేశామని భూ పాలపల్లి డీఎస్పీ రాములు తెలిపారు. సోమవారం కేసు వివరాలను వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకరయ్య కూతురు రక్షిత నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నదని, ఈ నెల 22న భూపాలపల్లి ఠాణా లో ఆమె మిస్సింగ్ కేసు నమోదైందని తెలిపారు. రక్షిత ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయం తెలుసుకొని, 24న కుటుంబసభ్యులతో కలి సి భూపాలపల్లి ఠాణాకు ఆమె వచ్చిందని తెలిపారు. తన స్నేహితులైన ఆలోకిక (బీటెక్ థర్డ్ ఇయర్, హైదరాబాద్), అజ్మీరా రాహుల్ (ఓపెన్ డిగ్రీ), య శ్వంత్ (బీటెక్ ఫైనలియర్, చెన్నై) వారి స్నేహితులకు తాను రాహుల్కు దగ్గరగా ఉన్న తన వ్యక్తిగత ఫొటోలు పంపారని, ఇది అవమానంగా భావించి తాను ఆ త్మహత్య చేసుకునేందుకు చెన్నైకి వెళ్లానని రక్షిత స్టేట్మెంట్ ఇచ్చిందని డీఎ స్పీ వివరించారు.
రక్షిత తన ఆత్మహత్య గురించి చెన్నైలోని స్నేహితుడు యశ్వంత్కు ఫోన్ చేసిందని, అతను ఆమెకు కౌ న్సెలింగ్ చేసి వరంగల్లోని తల్లిదండ్రులకు రక్షితను అప్పగించి తిరిగి చెన్నై వెళ్లిపోయాడని తెలిపారు. రక్షిత వాంగ్మూలాన్ని అనుసరించి మిస్సింగ్ కేసును సెక్షన్ 354డీ (ఐపీసీ)గా మార్చి ఆ కాపీలను కోర్టుకు నివేదించామని వివరించారు. ఈ క్రమంలో విచారణ కోసం పైముగ్గురు విద్యార్థులను రప్పిస్తున్నామని, ఈ నెల 26న ఠాణాకు రావాలని రక్షిత తల్లిదండ్రులకు తాము సూచించామని తెలిపారు. విచారణ కోసం ఈ నెల 26న యశ్వంత్, రాహుల్ను భూపాలపల్లి పోలీస్స్టేషన్కు రప్పించి వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రక్షితను, ఆమె తల్లిదండ్రులను కూడా విచారణకు పిలిచే క్రమంలోనే విద్యార్థిని రక్షిత వరంగల్లోని తన చిన్నమ్మ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందిందని తెలిపారు. రక్షిత ఆత్మహత్య ఘటనపై వరంగల్ మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ రాములు తెలిపారు.