హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని కర్ణాటక బీసీ కమిషన్ కొ నియాడింది. తెలంగాణ బీసీ కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాలపై ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్, సభ్యులతో కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే, సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వకుళాభరణం.. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించి న మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని బీసీల స్థితిగతులపై అధ్యయనం మొదలుపెట్టినట్టు తెలిపారు. కల్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ, గు రుకుల విద్య పథకాలు, చేపట్టిన చర్యలను వివరించారు. కర్ణాటక బీసీ కమిషన్ సభ్యు లు బీసీల అధ్యయనం కోసం కర్ణాటకను కూడా సందర్శించాలని తెలంగాణ బీసీ కమిషన్ను ఆహ్వానించారు. సమావేశంలో తెలంగాణ, కర్ణాటక బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్, కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, రాజశేఖర్, ఎస్హెచ్ కల్యాణ్కుమార్, అరుణ్కుమార్, సువర్ణ, తెలంగాణ బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉన్నారు.