హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్ మంగళవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నానని వెంకటేశంగౌడ్ తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ బీసీ సామాజిక వర్గాల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చక కాంగ్రెస్కు రాజీనామా చేశానని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కేసీఆర్తోనే సాధ్యమని విశ్వసిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పాల్గొన్నారు.