100 శాతం వివరాలు నమోదు చేయాలి
స్మార్ట్సిటీ ప్రాజెక్టుల వేగం పెంచండి
గ్రామీణ పాంతాల్లో టీఎస్ బిపాస్
సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలో జనన-మరణాలు 100 శాతం నమోదు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్లో శనివారం వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనన-మరణాలపై ఆన్లైన్ నోటిఫికేషన్ కోసం దవాఖానలకే పరిమితం కాకుండా శ్మశాన వాటికలు, దహన వాటికలను కూడా జనన- మరణాల నమోదు ప్లాట్ఫామ్లో చేర్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్, సీడీఎంఏ, కుటుంబ సంక్షేమ, వైద్యారోగ్య శాఖల అధికారులకు సూచించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ, ఇతర స్థానిక పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ పంచాయతీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా వరంగల్, కరీంనగర్లో సివిల్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో టీఎస్బీపాస్ విజయవంతంగా అమలవుతున్న దృష్ట్యా, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ టీఎస్బీపాస్ను అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సైతం సిద్ధమయ్యాయని చెప్పారు. ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీ ఎస్ఏఎం రిజ్వీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ కమిషనర్ శేషాద్రి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.