హైదరాబాద్ : తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ వేడుకలు ఈనెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా 30వ తేదీన రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అమ్మపల్లి గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో బతుకమ్మ పండుగ నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా అమెరికన్ కౌన్సిలర్ జనరల్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆలయాన్ని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో కలిసి సందర్శించారు. బతుకమ్మ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదేశించారు.