Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తాజా ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులచే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి.
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్బరుద్దీన్ ఒవైసీ చేత ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీదర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు.