హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన తహసీల్దారే అక్రమార్కులతో కలిసి కబ్జాకు పూనుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాళ్లోకెళ్తే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181లో సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ ఆర్పీ జ్యోతి ఆ 42 ఎకరాలను కాజేయాలని దస్తావేజులను తారుమారు చేశారు. ఈఐపీఎల్ రియల్ ఎస్టేట్ యజమాని కొండపల్లి శ్రీధర్రెడ్డికి చట్టవిరుద్ధంగా విక్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్, రియల్టర్పై కేసులు నమోదు చేశారు.