హైదరాబాద్ : తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది.
ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోటఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు.