ఆన్లైన్ క్లాసులకు ఏర్పాట్లు.. విద్యార్థుల నమోదుపై దృష్టి
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లుచేస్తున్నది. ఈ నెల 16 నుంచి ఉపాధ్యాయలు విధులకు హాజరయ్యేలా చూడాలని భావిస్తున్నది. ఇందుకు విద్యాశాఖ అధికారులు త్వరలోనే ఆదేశాలు జారీచేయనున్నారు. కరోనా నేపథ్యంలో మార్చి 23న పాఠశాలలను మూసివేశారు. తాజాగా నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందుగా స్కూళ్ల స్థితిగతులు సహా ఇతర ఏర్పాట్లపై అధికారులు దృష్టిపెట్టారు.