హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో నిలిచిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి మరో రెండు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్యూపీపీ టీ), వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం (పెటా టీఎస్)లు మద్దతు ప్రకటించాయి. పదోన్నతులు సహా తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చినందున ఈ మేరకు ఆయా సంఘాల నేతలు మహ్మద్ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ, బీ రాఘవరెడ్డి, పీ కృష్ణమూర్తిలు మద్దతు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోని టీచర్లు గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.