హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ గురువారం పదవీ ప్రమాణం చేశారు. శాసనమండలి చైర్మన్ చాంబర్లో ఆయన చేత చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రమాణం చేయించారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బడుగుల లింగయ్యయాదవ్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎన్ భాసర్రావు, అరికెపూడి గాంధీ, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజ్, కుసుమ జగదీశ్, ఆంగోతు బిందు తదితరులు తాతా మధుకు శుభాకాంక్షలు తెలిపారు.