కరీంనగర్ కార్పొరేషన్ ; కరీంనగర్ గొంతెండుతున్నది. గత మూడేండ్లలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే పలు డివిజన్లలో నీటి కటకట మొదలైంది. ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గిపోతే, సిరిసిల్లలోని మధ్యమానేరు నుంచి నీటిని తరలించి నగరానికి సరఫరా చేస్తుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయకపోవడంతో గత నెల నుంచే 17, 22, 38, 39, 56వ డివిజన్లలో నీటి కటకట మొదలైంది. ఫలితంగా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 22వ డివిజన్లోని పలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడే ఇలావుంటే నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.