హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ప్రాథమికంగా అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు బుధవారం వెల్లడించారు. ఈ నెల 16న అనారోగ్యంతో ఆయన ఏఐజీలో చేరిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకమని, అప్పటివరకు వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించడంతో పాటు వెంటిలేషన్తో కూడిన చికిత్స అందించడం జరుగుతుందని వైద్యనిపులు ఆ బులెటిన్లో పేర్కొన్నారు.