Tamilisai | హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో తన రాజీనామాపై తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. తాను ఎప్పటికీ తెలంగాణ సోదరినే. తనపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని తమిళిపై పేర్కొన్నారు.
తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానం నుంచి తమిళిసై పోటీ చేసే అవకాశం ఉంది. లేదంటే పుదుచ్చేరి ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే అంశానికి త్వరలోనే తెరపడనుంది.
2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2006లో రాధాపురం నియోజకవర్గంలో 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం నియోజకవర్గంలో పోటీ చేశారు. కానీ గెలవలేదు.