శాలిగౌరారం, డిసెంబర్ 28 : నల్లగొండ జిల్లా శాలిగౌరారం వాసికి తమిళనాడు ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కూతాటి గోపాల్కు అక్కడి ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి కల్పించింది.
1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన తమిళనాడులోనే జాయింట్ కలెక్టర్, కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు.