ఏర్గట్ల, సెప్టెంబర్ 26: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ రజక సంఘానికి చెందిన మొత్తం 30 కుటుంబాల వారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతు తెలుపుతూ మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందానికి అందజేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ప్రకటించారు.