హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్య పనితీరులో రాష్ట్రంలోని 12 జిల్లాలు ఉత్తమ్ గ్రేడ్స్ను సొంతం చేసుకొన్నాయి. మరో 20 జిల్లాలు ప్రచేస్త గ్రేడ్ -1 సాధించగా, ఒక జిల్లా ప్రచేస్త -గ్రేడ్ 2ను కైవసం చేసుకొన్నది. కేంద్ర విద్యాశాఖ ఇటీవలే విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ2019-20)లో ఈ విషయం వెల్లడైంది. గతంలో రాష్ర్టాల పనితీరును బట్టి గ్రేడ్స్ ఉండేవి, ఇప్పుడు జిల్లాలకు కేటాయిస్తున్నారు. మొత్తం 83 ఇండికేటర్స్లో 600 మార్కులకు సూచీని రూపొందించారు. అభ్యాస ఫలితాలు, నాణ్యత, పాఠశాలలు అందుబాటులో ఉండటం, టీచర్ల లభ్యత, మౌలిక సదుపాయాలు, సమర్ధవంతమైన తరగతి గది నిర్వహణ, స్కూల్ సేఫ్టీ, పిల్లల రక్షణ, డిజిటల్ లర్నింగ్, గవర్నెన్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు కేటాయిస్తారు.
గతం కన్నా మెరుగ్గా..
జిల్లా పీజీఐ ఇండెక్స్ 201819లో 12 జిల్లాలు ఉత్తమ్ గ్రేడ్, 20 జిల్లాలు ప్రచేస్త -గ్రేడ్ 1, ఒక జిల్లా ప్రచేస్త గ్రేడ్ -2ను సొంతం చేసుకొన్నాయి. వీటితో పోల్చితే 2019-20లో ఓవరాల్ మార్కులు పెరగడం గమనార్హం. 2018-19లో ఖమ్మం జిల్లా 392, హనుమకొండ 391, రంగారెడ్డి 387 మార్కులతో తొలిమూడు స్థానాల్లో నిలిచాయి. తాజా నివేదికలో ఈ మూడు జిల్లాలో ఓవరాల్ మార్కులు పెరిగాయి.