నేషనల్ పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేశ్కు టీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, యువనేత తలసాని సాయికిరణ్యాదవ్ ఆర్థికచేయూతనందించారు. పవర్ లిఫ్టింగ్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలకు వెళ్లాలనే పట్టుదల ఉన్నప్పటికీ ఆమెకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. అలాంటి పరిస్థితుల్లో వైష్ణవి మహేశ్కు రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం అవసరమైన ఎక్విప్మెంట్ను తలసాని సాయికిరణ్యాదవ్ తన సొంత ఖర్చులతో అందజేశారు. ఆ తర్వాత ఆమె జనవరిలో రాజస్తాన్లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్లో కాంస్య పతకం సాధించింది. జూన్17 నుంచి 21 వ తేదీ వరకు కోయంబత్తూర్లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు వైష్ణవి ఎంపికైంది. ఈ పోటీల్లో బంగారు పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్న వైష్ణవి మహేశ్ శిక్షణ కోసం అవసరమైన రూ. 60 వేలను తలసాని సాయి కిరణ్యాదవ్ అందజేశారు.
ఈ సందర్భంగా సాయికిరణ్యాదవ్ మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను ప్రోత్సహించడం వల్ల మన రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు లభిస్తాయని చెప్పారు. వైష్ణవి మరెన్నో పోటీలలో పాల్గొని మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, తాను ఉన్నతంగా రాణించేందుకు ఎంతో ప్రోత్సహించి సహకరించిన సాయికిరణ్యాదవ్కు వైష్ణవిమహేశ్ కృతజ్ఞతలు తెలిపారు.