మందమర్రి, జూలై 18 : బీఆర్ఎస్ ప్రభు త్వం నిరుపేదల కోసం మందమర్రి మున్సిపాలిటీలోని ప్రాణహిత కాలనీలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది. ఇంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ఇండ్ల పంపిణీలో జాప్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల క్రితం 230 ఇండ్లను లాటరీ పద్ధతిన కేటాయించింది. మిగిలిన 330 ఇండ్లను కేటాయించేందుకు 444 మందితో అర్హుల జాబితాను ఇటీవల ప్రకటించింది. దీంతో మొదలైన వివాదం ఇండ్లను స్వాధీనం చే సుకొనే వరకు వెళ్లింది. విద్యానగర్ కాలనీకి చెందిన పలువురు శనివారం అధికారులు వేసిన తాళాలను పగుల గొట్టి.. ఇండ్లను స్వాధీనం చేసుకొని వేరే తాళాలు వేశారు.