హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్గా నియమితులైన సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని హజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని హాజరయ్యారు. బియాబానికి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హజ్ కమిటీ ఈవో లియాఖత్ హుస్సేన్తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.