హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ ఎన్ సుధాకర్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్ హాజరయ్యారు. అనంతరం మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ.. సుధాకర్రావు వంటి ప్రతిభావంతుడికి సీఎం కేసీఆర్ మంచి అవకాశం కల్పించారని తెలిపారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్రావు అనుభవం ఆరోగ్యశ్రీకి అవసరమన్నారు. అనంతరం సుధాకర్రావును సన్మానించారు.