హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): టీ న్యూస్ తెలంగాణ ‘గోల్డెన్ ఎడ్యుకేషన్2023’ ఫెయిర్కు అపూర్వ స్పందన లభిస్తున్నది. హైదరాబాద్ నిజాం కాలేజీలో నిర్వహించిన ఈ ఫెయిర్కు రెండో రోజు శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాలేజీల సమాచారాన్ని, గ్రూపుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఏ కాలేజీని ఎంపిక చేసుకోవాలి? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? అన్న సందేహాలను తీర్చుకొన్నారు. కాలేజీల ఎంపిక అంశంపై ప్రొఫెసర్ డాక్టర్ రాజు సెమినార్ నిర్వహించారు. ఇంజినీరింగ్తోపాటు పలు కోర్సులపై విద్యార్థులకు ఈ ఫెయిర్లో అవగాహన కల్పించారు. వెబ్ కౌన్సెలింగ్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొన్నారు. సమాచారాన్నంతా ఒకేచోట చేర్చి గొప్ప అవకాశం కల్పించిన ‘టీ న్యూస్’కు కృతజ్ఞతలు తెలిపారు. ఫెయిర్ పట్ల కాలేజీ యజమాన్యాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో టీ న్యూస్ సీజీఎం ఉపేందర్, డీజీఎం కిరణ్, మార్కెటింగ్ టీం సత్యపాల్రెడ్డి, శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, వెంకట్రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
‘టీ న్యూస్’ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్-2023 ఫెయిర్ ఆదివారం ముగియనున్నది. ఈ ఫెయిర్కు ప్లాటినం స్పాన్సర్గా మర్రి లక్ష్మణ్రెడ్డి విద్యాసంస్థలు, డైమండ్ స్పాన్సర్గా సీఎంఆర్ విద్యా సంస్థలు, గోల్డ్ స్పాన్సర్గా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు వ్యవహరిస్తున్నాయి.