హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఈక్విటీ, ఏంజిల్ ఫండ్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏర్పాటు చేసిన మాగ్నిఫిక్ సెక్యూరిటీస్ టీ-హబ్తో ఒప్పందం చేసుకున్నది. శుక్రవారం టీ-హబ్ సీఈవో ఎంఎస్రావుతో మాగ్నిఫిక్ సెక్యూరిటీస్ ప్రతినిధులు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.
స్టాక్ మార్కెట్ నిపుణులు స్థాపించిన ఈ సంస్థ ప్రధానంగా ప్రైవేట్ ఈక్విటీ కింద స్టాక్లకు అత్యంత విశ్వసనీయ ప్లాట్ఫామ్గా ఉన్నది. వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తూనే, వారి పెట్టుబడుల ద్వారా సంపదను పెంచుకునేలా మాగ్నిఫిక్ సెక్యూరిటీస్ కృషి చేస్తున్నదని టీ-హబ్ ప్రతినిధి
తెలిపారు.