హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) రూపొందించిన పాఠ్యాంశాలను రాష్ట్రంలోని సర్కార్ బడిపిల్లలకు బోధించనున్నారు. టిస్ సంస్థ… కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ్ (క్లిక్స్) ప్రాజెక్ట్ పేరుతో గణితం, ఇంగ్లిష్, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలతో ప్రత్యేక మాడ్యూల్స్ను రూపొందించింది.
ఈ పాఠ్యాంశాలను 8, 9 తరగతుల విద్యార్థులకు వారానికి 4 పీరియడ్లలో బోధిస్తారు. ఐసీటీ ల్యాబ్లున్న బడుల్లో ఈ పాఠ్యాంశాలను ప్రసారమవుతాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు.