మల్యాల, జూన్ 24: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలపై కత్తితో గాట్లు పెట్టిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారికి ఆనుకొని ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మూడేండ్ల కిందట మొక్కలు నాటారు. ఇటీవల నూకపెల్లికి చెందిన చెట్పెల్లి రాజయ్య కుటుంబ సభ్యులు మొక్కలకు కత్తితో గాట్లు పెట్టారు. స్పందించిన ఎంపీడీవో శైలజ గురువారం వారికి రూ.6 వేల జరిమానా విధించారు.