హిమాయత్నగర్, జనవరి 9: తొలగించిన ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, స్కావెంజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ పాఠశాలల సర్వీస్ పర్సన్స్, స్వీపర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం హిమాయత్నగర్లోని యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.