బంజారాహిల్స్, జనవరి 9: ప్రజాపాలనలో దరఖాస్తు చేసేందుకు సొంతూరుకు వెళ్లి వచ్చిన మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వనపర్తి జిల్లా తాడిపర్తికి చెందిన బోయిని అలివేలమ్మ (52) కొన్నేండ్లుగా యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్లో భర్త వెంకటయ్య, కొడుకు సాయికుమార్తో కలిసి ఉంటున్నది. ప్రజాపాలనలో రేషన్కార్డు దరఖాస్తు కోసం ఈ నెల 5న సొంతూరుకు వెళ్లింది. ఈ నెల 6న సాయంత్రం బస్సులో హైదరాబాద్కు బయలుదేరింది.
హైదర్గూడలో ఉండే కుమార్తె అరుణ వద్దకు వెళ్లాలని రాత్రి 8.30కు ఆరాంఘర్ వద్ద బస్సు దిగిన అలివేలమ్మ ఆ తర్వాత కనిపించకుండాపోయింది. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కు టుంబసభ్యులంతా వెతికినా ఆమె ఆచూకీ దొ రక్కపోవడంతో ఈ నెల 7న ఠాణాలో ఫిర్యా దు చేశారు. సోమవారం కమలాపురి కాలనీలో మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. మృతదేహాన్ని ఉస్మాని యా దవాఖానకు తరలించి, అలివేలమ్మ కొ డుక్కి సమాచారమిచ్చారు. మృతదేహాన్ని చూ సిన సాయికుమార్ అది తన తల్లిదేనని చె ప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.