నిజామాబాద్ క్రైం, జూన్ 28: లంచం తీసుకుంటూ నిజామాబాద్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ కథనం ప్రకారం.. మోర్తాడ్ మండలం ధర్మోరాకు చెందిన రైతు రాజేందర్ తన భూమిలో షెడ్డు వేయడానికి ల్యాండ్ కన్వర్షన్కు అవసరమైన మ్యాప్/స్కెచ్ రిపోర్ట్ కోసం నిజామాబాద్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయానికి వెళ్లాడు. పని పూర్తికావాలంటే ఏడీ సార్తోపాటు తమకు లంచం ఇవ్వాలని సూపరింటెండెంట్ వెంకటేశ్, జూనియర్ అసిస్టెంట్ రహీ మా డిమాండ్ చేయగా సూపరింటెండెంట్కు రూ.3 వేలు, జూనియర్ అసిస్టెంట్కు రూ.2 వేలు ఇచ్చాడు.
అయినా పనిచేయకపోవడంతో ఆరా తీశాడు. ఏడీ డైరెక్టర్ శ్యామ్సుందర్రెడ్డికి కూడా లంచం ఇవ్వాల్సి ఉంటుంద ని సూచించడంతో రైతు రాజేందర్ బుధవారం ఏడీకి రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.వారం క్రితం లంచం తీసుకున్న సూపరింటెండెంట్ వెంకటేశ్, జూనియర్ అసిస్టెంట్ రహీమపైనా కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.