హైదరాబాద్, మార్చి 29 : టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభాపక్ష ఉపనేతగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మంగళవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పార్టీ రాజ్యసభాపక్ష ఉపనేతగా వ్యవహరించిన బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ ఖాళీ ఏర్పడింది. తన నియామకం పట్ల సురేశ్రెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.