వెంకటాపురం (నూగూ రు), డిసెంబర్ 21: ములుగు జిల్లా వెంకటాపురం (నూగూ రు) మండలంలోని సూరవీడు మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ట్టు తెలుస్తున్నది. కొర్స రమేశ్, రజిత దంపతులు ఐదేండ్ల క్రితం సూరవీడు పంచాయతీ కొండాపురం గ్రామం నుంచి వచ్చి ఏటూరునాగారంలో ఉంటున్నారు. రమేశ్ కారు డ్రైవర్గా, రజిత ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు పద్ధతిలో నర్సుగా పనిచేస్తున్నారు. సోమవారం రమేశ్ తన స్వగ్రామమైన కొండాపురం వెళ్లారు. అక్కడి నుంచి కొందరు వ్యక్తులు రమేశ్ను తీసుకువెళ్లినట్టు తనకు సమాచారం ఉన్నదని అతని భార్య రజిత తెలిపారు. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భర్త అమాయకుడని, ఒకవేళ మావోయిస్టులు తీసుకెళ్తే వెంటనే వదిలివేయాలని వేడుకొన్నారు.