హైదరాబాద్ : సుప్రీంకోర్టు ( Supreme Court ) మానవాళికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ( Boinapally Vinod Kumar ) అన్నారు. దేశంలో ఉన్న ప్రతి మహిళ సర్వీసు ( Women Service) ను నెలకు 30 వేలుగా నిర్ధారించడం అభినంద నీయమని అన్నారు.దేశంలో సుప్రీంకోర్టు తీర్పులు పార్లమెంట్ చట్టాలతో సమానమని పేర్కొన్నారు.
మహిళలు జాతి నిర్మాతలు అని పేర్కొనడంతో మహిళలకు సమాజంలో విలువ పెరుగు తుందని, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు లలితా రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా మాట్లాడుతూ సమాజంలో మహిళల పనికి ఇప్పటి వరకు గుర్తింపు రాలేదని,గృహిణీపై పురుషులు ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. సుప్రీంకోర్టు మహిళలను గౌరవిస్తూ సంచలన తీర్పు ఇచ్చిందని అన్నారు.మహిళలను యంత్రాలుగా చూసే సమాజంలో సుప్రీం కోర్టు తీర్పుతో మహిళలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు.