రంగారెడ్డి : మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగాలని మహిళ కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy ) అన్నారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు(Womens day) మంగళవారం నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకొస్తే అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మహిళల విజయం వెనకాల కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం షీటీం(She teams) లను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. మహిళ కమిషన్( women commission) ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం కోసం 181 హెల్ప్లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
అవసరం లేని విషయాలను సోషల్ మీడియాలో చూసి జీవితాలను నాశనం చేసుకోవడం బాధాకరం ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు సైబర్ క్రైం పెరుగుతుందని ముఖ పరిచయాలు లేని వ్యక్తులకు తమ వ్యక్తి గత వివరాలను పంపించవద్దని సూచించారు. ప్రతి ముగ్గురు మహిళలో ఒక మహిళా వేధింపులకు గురవుతునన్నారని తెలిపారు.
మహిళలు విద్య, ఉద్యోగ పరంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి లక్ష్మి కందకట్ల, కళాశాల డైరెక్టర్ రోహిత్ కందకట్ల, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలత, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ శ్రీనివాస్రెడ్డి, హెచ్ఆర్ చందన, ఏవో రవికిరణ్రెడ్డి, వాణి,డీన్స్,హెచ్ఓడీలు, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.